ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని
దర్శించుకున్నారు.
శనివారం ఉదయం ప్రారంభ దర్శనంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించారు. ఈ
సందర్భంగా నాగార్జున శ్రీనివాసునికి తలనీలాలు సమర్పించుకున్నారు.
నాగార్జునతోపాటు అమల, అఖిల్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దర్శనం అనంతరం
నాగార్జున మీడియాతో మాట్లాడుతూ 'రాజన్న' డిఫరెంట్ గా ఉందని...ఢమరుకం సినిమా
మరింత ఆసక్తికరంగా ఉంటుందన్నారు. కాగా
ఈరోజు తిరుమలకు వీఐపీల తాకిడి అధికంగా ఉంది. ఆనాటి హీరోయిన్ మీనా
కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా అదే సమయంలో ముఖ్యమంత్రి
రావడంతో మీనా ఇబ్బంది పడ్డారు. కొద్దిసేపు సామాన్య భక్తులతో ఉండిపోయారు
No comments:
Post a Comment