ప్రజల
ముక్కు పిండి మరీ వసూలు చేసిన పన్నులను ఉద్యోగులు ఖజానాలో జమచేయకుండా,
దిగమింగి జైలుపాలైన విషయం మరువకముందే పారిశుద్ధ్య పనులకు సంబంధించి వాహనాల
కొనుగోలులో గోల్మాల్కు పాల్పడిన వ్యవహారం వెలుగుచూసింది. వివరాలిలా
ఉన్నాయి. 12 ఆర్థిక సంఘం నిధుల కింద మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనుల కోసం
హైడ్రాలిక్ తరహా వాహనాలు కొనుగోలు చేయాల్సి ఉంది. అయితే అధికారులు
నిబంధనలను తోసిరాజని.. రూ.20 లక్షల వ్యయంతో మహేంద్ర కంపెనీకి చెందిన మూడు
ఆటోలు, ఒక టిప్పరును కొనుగోలు చేశారు. ఏడాది క్రితం ఈ వాహనాల కొనుగోలకు
పాలకవర్గం ఆమోదం తెలపడంతో, రెండునెలల క్రితం అవి మున్సిపాలిటీకి
చేరుకున్నాయి. వీటికి ఇప్పుడు మళ్లీ లక్షలాది రూపాయలు ఖర్చు చేసి
హైడ్రాలిక్ ఏర్పాటు చేయాల్సి ఉంది. లక్షలాది రూపాయలు కమీషన్ తీసుకుని
వీటిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి.ఈ
గోల్మాల్కు బాధ్యులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు
సమాచారం. ఏదీ ఎమైనప్పటికీ మున్సిపాలిటిలో తవ్వేకొద్దే అవకతవకలు
బయటికొస్తున్నాయి. అభివృద్థి పేరిట చేపట్టిన అన్ని పనుల్లో సంబంధిత
అధికారులు అవకతవకలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
వెళుతున్నాయి. మున్సిపాలిటీలోని అన్ని విభాగాల్లో అవినీతి జరిగిందన్న
ఆరోపణలున్నాయి. రియల్ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కైన కొందరు వ్యాపారులు
జేబులు నింపుకుంటున్నట్లు సమాచారం. అవినీతి అధికారులను విధుల నుంచి
శాశ్వతంగా తొల గించాలని ఇటీవలో హైకోర్టులో పిల్ దాఖాలు అయిన విషయం
తెలిసిందే. గతంలో జరిగిన టెండర్లలో అనుమానాలు ఉన్నాయని, వృద్ధులకు, ఇతర
పింఛన్ దారులకు న్యాయం జరగడంలేదన్న ఆరోపణలు హైకోర్టు దృష్టికి వెళ్లింది.
No comments:
Post a Comment