పల్లెల నుంచి మద్యాన్ని తరిమేద్దాం...వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ మద్యం కారణంగా మహిళల జీవితాలు అన్యాయం
అయిపోతున్నాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు తమ
భర్తలను, బిడ్డలను అదుపు చేసుకోలేని విధంగా మానవత్వం లేని ప్రభుత్వం ఊరూరా
మద్యం దుకాణాలు, సారా బట్టీలను నెలకొల్పిందని మండిపడ్డారు. ప్రభుత్వంలో
ఉన్న నాయకుడే ప్రతినెల 15 శాతం తాగుబోతులను పెంచాలని లక్ష్యాలను
నిర్ధేశించటం దుర్మార్గమన్నారు. మరోవైపు బాధ్యతగల ప్రతిపక్ష
నాయకుడు కూడా సరసమైన ధరలకు మద్యం అమ్మాలని డిమాండ్ చేయటం విడ్డూరంగా ఉందని
జగన్ ఎద్దేవా చేశారు. త్వరలోనే స్వర్ణయుగం రాబోతుందని పల్లెల్లో సారా
బట్టీలు, బ్రాందీ షాపులు లేని రాజ్యాన్ని నెలకొల్పుతామని
వైఎస్ జగన్ అన్నారు. మహిళల జీవితాలను నాశనం చేసే ఈ మద్యాన్ని గ్రామాల్లో
నిషేధించేందుకు ప్రతి ఊర్లో మహిళా పోలీసింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రాణాలు
పోసే 108ను ప్రభుత్వం మూలన పడేసిందని కల్తీసారా బాధితుల వద్దకు సకాలంలో
చేరుకోక పోవటం వల్ల మృతుల సంఖ్య పెరిగిందన్నారు. మహానేత వైఎస్ఆర్ లేని లోటు
రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తుందని త్వరలోనే ఈ సువర్ణయుగం రాబోతుందని
అన్నారు.
No comments:
Post a Comment