జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తేవాలని కలెక్టర్ వి.దుర్గాదాస్
క్రీడాకారులకు ఉద్బోధించారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో ఏపీ
స్కూల్ గేమ్స్ అండర్ -19 రాష్ట్ర స్థాయి షటిల్ బ్యా డ్మింటన్ పోటీలను ఆయన
ప్రారంభించారు. అంతర్జాతీయ క్రీడాకారులు పుల్లెల గోపీచంద్, సైనా
నెహ్వాల్ను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు. పట్టుదలతో సాధన
చేస్తే స్టార్ ఆటగాళ్ల స్థాయికి చేరుకోవచ్చునన్నారు. గెలుపు ఓటములు
సమా నంగా తీసుకోవాలన్నారు. నిరంతరంగా సాధ న చేసి, ఆత్మవిశ్వాసం పెంచుకుని,
ఎంచుకున్న రంగంలో దూసుకుపోవాలని జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి, సీనియర్
షటిల్ బ్యా డ్మింటన్ క్రీడాకారుడు డాక్టర్ జొన్నా సత్యనారాయణ అన్నారు.
చదువుతోపాటు క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆర్.ఐ.ఓ క్రిష్టప్ప
అన్నారు. ఇన్చార్జ్ డీవీఈఓ ఒన్నప్ప, ప్రభు త్వ జూనియర్ కళాశాల
ప్రిన్సిపాల్ రాజారాం, ఇన్చార్జ్ డీఎస్డీఓ జగన్నాథ రెడ్డి, క్రికెట్
లెవెల్ 2 కోచ్ శ్రీవాస్ రెడ్డి, పోటీల రాష్ట్ర పరిశీలకులు పోతులయ్య,
కార్యనిర్వహణ కార్యదర్శి గోవిందరావు పాల్గొన్నారు. దాదాపు 16 జిల్లాల
జట్లు ఈ పోటీలకు హాజరయ్యాయి.
No comments:
Post a Comment