శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాల్లోని
హుండీల ద్వారా నగదు రూపేణా రూ.1,00,21,480 వచ్చినట్లు ఇన్చార్జి ఈఓ
ధనలక్ష్మి తెలిపారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మండపంలో రెండు రోజుల
పాటు హుండీలను లెక్కించామన్నారు. నగదుతో పాటు 84 గ్రాముల బంగారం, ఒక కేజీ
230 గ్రాముల వెండితో పాటు యూఎస్ డాలర్లు 124.. ఐదు యూరోల విదేశీ కరెన్సీ
వచ్చాయన్నారు. ఈ మొత్తం 21 రోజుల్లో మల్లన్నకు వచ్చిన ఆదాయమని ఆమె
పేర్కొన్నారు. భక్తుల కానుకలు, వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయంతో
కోటీశ్వరుడయ్యాడు. మంగళ,బుధవారాలలో రెండు రోజుల పాటు జరిగిన హుండీల
లెక్కింపులో రూ. 1,06,28,555లు ఆదాయం చేకూరింది.
No comments:
Post a Comment