అలీ, బ్రహ్మానందంలకు నో చెప్పిన పూరీ జగన్నాధ్?
పూరీ జగన్నాధ్ ప్రతీ చిత్రంలోనూ బ్రహ్మానందం, అలీలకు ప్రత్యేకమైన కామిడీ
ట్రాక్ ఉంటుంది. అయితే ఈసారి మహేష్ తో చేస్తున్నది బిజినెస్ మ్యాన్
చిత్రంలో వారిద్దరికీ నో చెప్పాడని తెలుస్తోంది. కేవలం ధర్మవరపు సుబ్రమణ్యం
మీద కామిడీ ఉండేలా ప్లాన్ చేసాడని, మిగతా కామిడి విభాగాన్ని మహేష్ చేతే
మోయించాడని అని వినపడుతోంది. దూకుడు సూపర్ హిట్ తో మహేష్ కామిడీ మీద
విపరీతమైన నమ్మకం కలిగిన పూరీ జగన్నాధ్ ఇలా ప్లాన్ చేసాడని
చెప్పుకుంటున్నారు. అయితే చిత్రంలో మంచి కామిడీ ఉందని,యాక్షన్ తో పాటు ఆ
సీన్స్ కు కూడా ప్రాముఖ్యత ఉందని సమాచారం.
No comments:
Post a Comment