Monday, 14 November 2011

జగన్ కు గుడ్ న్యూస్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు  ఆదేశించింది.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన హైకోర్టు, చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్‌లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థకి కోర్టు నిర్దేశించింది.
          చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది

No comments:

Post a Comment