నాగార్జున పక్కా బిజినెస్ మ్యాన్, చాలా పద్దతి గల మనిషి,దేని లెక్క దానిదే అన్నట్లు ఉంటాడు వంటివన్నీ చెప్తుంటారు.అయితే తాజాగా హైదరాబాద్ కి వచ్చిన సంజయ్ దత్ నాగార్జునపై ఓ కామెంట్ చేసాడు.'చంద్రలేఖ'లో కనిపించినందుకు తనకు నయాపైసా కూడా ఇవ్వలేదని,అందుకే తెలుగు సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నానని డైరక్ట్ గా మొహమాటం లేకుండా అనేసాడు.కృష్ణవంశీ దర్శకత్వంలో నాగార్జున స్వయంగా తన బ్యానర్ పై నిర్మించిన చిత్రం 'చంద్రలేఖ'.మోహన్ లాల్ హీరోగా ప్రియదర్శన్ డైరక్షన్లో మలయాళంలో వచ్చిన చిత్రానికి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్దగా ఆడలేదు.అయితే అందులో వెరైటీగా ఉంటుందని ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్స్ కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని తీసుకొచ్చారు.ఆయన పాపం నాగార్జునపై ఉన్న గౌరవమో మరేమో కానీ..తనకున్న ప్యాన్ ఫాలోయింగ్ ని ప్రక్కన పెట్టి నటించాడు. అయితే అందుకు రెమ్యునేషన్ కూడా ఇవ్వలేదని ఇన్నాళ్ళ తర్వాత ఆయన బయిట పెట్టారు
No comments:
Post a Comment