Monday, 7 November 2011

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ కిరణాల శిక్షణ ఉపాధి

నిరుద్యోగ యువతకు రాజీవ్ యువ కిరణాల ద్వారా ప్రభుత్వ ఖర్చు తో శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించడం జరుగుతుందని కలెక్టర్ వి. అనిల్‌కు మార్ పేర్కొన్నారు.  డీఆర్ డీఏ కార్యాలయంలో కలెక్టర్ రాజీవ్ యువకిరణాలు పథకం అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కల్గిన నిరు ద్యోగ యువత రాజీవ్ యువకిరణాలు ప«థకం ద్వారా ఉపాధిని కల్పించే అవ కాశాన్ని ప్రభుత్వం కలిగిస్తోందన్నారు. ఉద్యోగం కావాల్సిన అభ్యర్ధులు సమీ పంలోని ఎంపీడీవో కార్యాలయం లేదంటే మున్సిపల్ కార్యాలయంలో తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. ఆ మేరకు ఎంపిీ డీవో, మున్సిపల్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించడం జరిగిందన్నారు.
 ఆర్‌వైకె. సిజిజి. జివోవి. ఇన్ వెబ్‌సైట్‌లో ఇంట ర్నెట్ సెంటర్లలో కూడా నమోదు చేసు కోవచ్చన్నారు. వివరాలు నమోదు చేసేందుకు రేషన్‌కార్డు నెంబర్, పుట్టిన తేది వ్యక్తి గత సెల్ ఫోన్ నెంబర్లు కలిగి ఉండాలన్నారు. అభ్యర్ధులతో పాటు పరిశ్రమలు, వ్యాపారస్తులు, ఇతర సేవా సంస్ధ యాజమానులు కూడా వెబ్‌సైట్‌లో వారి సంస్ధ వివరాలు, వారికవసరమైన ఉద్యోగులు, అందుకు కావాల్సిన అర్హతలను నమోదు చేసుకో వాలని సూచించారు. పెద్దపెద్ద సంస్ధల కు ఉద్యోగులు ఎక్కువగా అవసరమ నుకుంటే జాబ్ మేళాలు కూడా నిర్వ హిస్తామన్నారు. స్ధానిక పరిశ్రమలు, ఇతర వ్యాపారస్ధులు ఉద్యోగులు అవసరమైతే డీఆర్‌డీఏ కార్యాలయా న్ని సంప్రదించి నేరుగా అభ్యర్ధులను తీసుకోవచ్చన్నారు

No comments:

Post a Comment