Sunday, 6 November 2011

అర్చక పరీక్షలకు దరఖాస్తుల ఆహ్వానం


 అన్ని రకాల ఆలయాల్లో అర్చకుల నియామక పరీక్షలకోసం దేవాదాయ, ధర్మాదాయ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆలయాల్లో ప్రవేశ, వర, ప్రవరలకు వచ్చే ఏడాది జనవరి 21, 22 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ కంట్రోలర్ చంద్రకుమార్ శనివారం తెలిపారు. అర్చక పరీక్షలు రాయదలచిన వారు ఈ నెల 30వ తేదీలోగా ఆయా జిల్లాల సహాయ కమిషనర్ల కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. పూర్తి వివరాలకోసం హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించవచ్చు. లేదా www.apendowments.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోగలరు.


No comments:

Post a Comment