Sunday, 6 November 2011

తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ఏసీ కల్యాణమండపం


తిరుమలలో 22 కోట్ల రూపాయలతో ఏసి కల్యాణమండపాన్ని
నిర్మించాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశ నిర్ణయాలను
ఆయన విలేఖరులకు వివరించారు. టిటిడి ఉద్యోగ సహకార బ్యాంకుకు 2 కోట్ల రూపాయలు షేర్క్యాప్టల్‌గా కేటాయించామన్నారు. 2009 నుండి ఈ ప్రతిపాదన వున్నప్పటికీ అమలు
కాలేదన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన నేపధ్యంలో టిటిడిఉద్యోగులకు 7,500 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
గతంలో 6500 రూపాయలు ఇచ్చేవారన్నారు. టిటిడిలో పనిచేసే అటెండర్లకు యూనిఫాంకొనుగోలుకు ఇకపై నగదు చెల్లించాలని నిర్ణయించామన్నారు. నారుూ బ్రాహ్మణులకమ్యూనిటీ హాలుకు తిరుపతిలో 1000 గజాలు కేటాయించాలని నిర్ణయించామన్నారు. గత 10
ఏళ్లుగా వారు ఈకోరికను తీర్చమని టిటిడికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు

No comments:

Post a Comment