Sunday, 6 November 2011

డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం


 రాజీవ్ యువ కిరణాలు ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోగా
డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్
ముఖ్యమంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. శనివారం హైదరాబాదు
నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్
మాట్లాడుతూ జిల్లాకు రాజీవ్ యువకిరణాల కింద 12,765 మందికి ఉపాధి కల్పించేందుకు ఈ
ఏడాది లక్ష్యంగా కేటాయించారని అందులో డిసెంబర్‌లోగా 5,292 మందికి ఉపాధి కల్పించేందుకు
ప్రణాళిక సిద్ధం చేశామని, ఇప్పటికే 2,749 మందికి శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పారు.
ఇంకా 2,543 మందికి శిక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల గ్రామీణ ప్రాంతాల్లో 10, 20,
30వ తేదీల్లో యువతను సమావేశపర్చి అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో గల 97
మంది పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటు చేసి వారికి కావాల్సిన రంగాల్లో యువతకు
శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 27 మంది పారిశ్రామిక వేత్తలు 2000 మందికి ఉపాధి
కల్పించగలమని తెలిపినట్లు వివరించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి 1 లక్ష మంది
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు చరుగ్గా పనిచేయాలని ఆదేశించారు.
రాజీవ్ యువకిరణాలు ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎక్కువ సంఖ్యలో ఎస్టీ,
ఎస్సీలకు అవకాశాలు కల్పించాలన్నారు. శిక్షణ ఇచ్చేటప్పుడే శిక్షణ పూర్తి అయ్యాక ఎక్కడ
అవకాశం ఉంటుంది, జీతం వివరాలను ముందుగానే స్పష్టంగా తెలపాలన్నారు

No comments:

Post a Comment