Saturday, 29 October 2011

ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు

శ్రీవారి భక్తులకు టిటిడి కొత్త నిబంధనలు విధించింది. ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాని భక్తుల టికెట్లు రద్దు చేసి సామాన్య భక్తులకు మంజూరు చేస్తామని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవా టికెట్లు వృధా అవుతున్నాయి. సంవత్సరాల తరబడి వేచి ఉన్నా దొరకని ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు వాటిని వినియోగించుకోవడం లేదు. రెండు నెలలుగా 30 నుంచి 50 శాతం మంది భక్తులు ఆర్జితసేవలకు రావడం లేదు. అభిషేకం, వస్త్రం సేవలకు శుక్రవారం 167మంది భక్తులు హాజరుకావాల్సి ఉన్నా...చాలామంది భక్తులు రాలేదు. హాజరుకాని భక్తులు ముందస్తుగా సమాచారం అందించలేదు.

దీనిపై టిటిడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్జిత సేవ టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో హాజరుకావాలని టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు అన్నారు. ముందురోజు ఆఫీస్‌కు రాని భక్తుల టికెట్లు రద్దు చేస్తామని.... వాటిని సామాన్య భక్తులకు మంజూరు చేస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడానికి టిటిడి సమయాత్తం అవుతోంది. తిరుమలలోని ప్రైవేటు మఠాలలో ఉన్న 30శాతం గదులను సామాన్య భక్తులకు మంజూరు చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది

No comments:

Post a Comment