Saturday, 29 October 2011

తిరుమల లడ్డూ వితరణశాలలోనూ భక్తులు కిక్కిరిశారు

                                     
 తిరుమలలో భక్తుల రద్దీ తరగడంలేదు. శనివారం కూడా కొండకు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 15, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దీపావళి పండుగ ముగియడం, వారాంతపు సెలవులు కావడంతో తిరుపతి సమీప ప్రాంతాల భక్తులు రెండు రోజులుగా తిరుమలకు తరలివస్తున్నారు. 

ముఖ్యంగా కాలిబాటన, సొంత, ప్రైవేటు వాహనాల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. ఇక వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపడక రోడ్లపై ఆపుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక గదుల కేటాయింపు మధ్యాహ్నానికే పూర్తవడంతో సగానికిపైగా భక్తులు ఆరుబయటే సేదతీరుతున్నారు. శనివారం ఎడతెరపి లేని చిరుజల్లులు పడుతుండడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండి, వెలుపల ఆళ్వారు ట్యాంకు చుట్టూ ఉన్న క్యూలైన్లో భక్తులు వేచివున్నారు. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల క్యూలైన్ కూడా కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది. శనివారం సుమారు 90 వేల మంది భక్తులు మహాలఘులో స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ వితరణశాలలోనూ భక్తులు కిక్కిరిశారు. ఈ రద్దీ మరో రెండు రోజులపాటు కొనసాగనుంది. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు

No comments:

Post a Comment