Saturday, 29 October 2011

తాగునీటి కష్టాలు పెరగనున్నాయి

అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. గతేడాదితో పోలిస్తే గ్రౌండ్‌వాటర్ లెవల్స్ నాలుగు మీటర్ల మైనస్‌కు పడిపోయాయి. భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతలో భూగర్భ జలనిధి కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం.^నీటి మట్టం పెంచేందుకు చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. దీంతో సాగు, తాగునీటి కష్టాలు పెరగనున్నాయి.

అలాగే నీటిలో ఫ్లోరైడ్ శాతంపెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. భూగర్భ జలవనరుల శాఖ^సేకరించిన గణాంకాల మేరకు 15.53 మటరల్ లోతుకు జలాలు పడిపోయాయి. నీటిమట్టం పడిపోవడంతో బోర్లకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులకు అదనపు కరెంట్ కష్టాలు వచ్చి పడ్డాయి. వర్షపునీటిని నిల్వ చేయడం, చెరువులు, చెక్‌డ్యామ్‌లను సంరంక్షించడంలో అధికారుల విఫలం కావడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది.

ఇసుక అక్రమ రవాణా కూడా నీటి నిల్వలు పడిపోవడానికి కారణం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు యుద్ద ప్రాతిపదికన వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. చెరువులు, కుంటలను రక్షించకుంటే భవిష్యత్ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉంది

No comments:

Post a Comment