తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బీఏ, బీకాం, మొదటి, రెండో, మూడో సంవత్సరం పరీక్షలు, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా అదే రోజు నుంచే మొదలవుతాయి. బీఎల్ఐఎస్సీ పరీక్షలను నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమవుతాయి.
ఇప్పటికే అభ్యర్థుల హాల్టిక్కెట్లను ఆయా పరీక్షా కేంద్రాలకు పంపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అదనపు సమాచారం కోసం www.svudde.org వెబ్సైట్లో లేదా 0877- 2289477 నంబరులో గాని సంప్రదించాలని ఎస్వీయూ డీడీఈ డీన్ ఎస్.వి.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు
ఇప్పటికే అభ్యర్థుల హాల్టిక్కెట్లను ఆయా పరీక్షా కేంద్రాలకు పంపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అదనపు సమాచారం కోసం www.svudde.org వెబ్సైట్లో లేదా 0877- 2289477 నంబరులో గాని సంప్రదించాలని ఎస్వీయూ డీడీఈ డీన్ ఎస్.వి.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు
No comments:
Post a Comment