Saturday, 18 February 2012

తిరుపతిలో అంతర్జాతీయస్థాయి స్టేడియం

తిరుపతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి త్వరలో పునాది రాయి వేయడానికి అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పార్లమెంటు సభ్యుడు డాక్టర్ చింతామోహన్ తెలిపారు. శ్రీకాళహస్తి రిపబ్లిక్ క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం జాతీయ స్థాయి టెన్నిస్ టోర్నీలో ఫైనల్ పోటీలను మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడుతో కలిసి తిలకించారు. అనంతరం విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ మాట్లాడుతూ రేణిగుంటలో అంతర్జాతీయస్థాయి విమానాశ్రయం, మన్నవరంలో భారీ విద్యుత్ ఉపకరణాల ప్రాజెక్టు రాకతో రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లా ప్రపంచంలోనే ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుందనడంలో సందేహం లేదన్నారు.

No comments:

Post a Comment