Saturday, 18 February 2012

కర్నూలులో జేపీ సత్యగ్రహ పాదయాత్ర ప్రారంభం

లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ శనివారం కర్నూలు జిల్లాలో రైతు సత్యగ్రహ పాదయాత్రను చేపట్టారు. ఆయన ఎమ్మిగనూరు నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర రాయచూరు వరకూ కొనసాగనుంది. జయప్రకాష్ నారాయణ ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అంతకు ముందు నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ప్రార్థనలు చేశారు.  ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ సంకెళ్లతో బస్తాలు మోసి తన నిరనస తెలిపారు.ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం రైతులకు ఉండాలని ఆయన అన్నారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఆంక్షలు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధఱలు రెండింతలు పెరిగాయని ఆయన విమర్శించారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని ఆయన అన్నారు. రైతుల కోసం జైలుకు వెళ్లడానికైనా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. రైతుల కోసం ఎవరు మద్దతిచ్చినా తీసుకుంటానని ఆయన చెప్పారు. తన యాత్రను తెలుగుదేశంశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రైతు పోరుబాటతో పోల్చుకోలేనని ఆయన అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడ పండిన పంటను అక్కడే అమ్ముకునే అవకాశం ఉండాలన్నారు. పండించిన పంటను అమ్ముకోవటానికి ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. ప్రభుత్వం చేసిన పాపాల వల్ల రెండేళ్లలో ఎరువుల ధరలు రెండింతలు పెరిగాయన్నారు. గిట్టుబాటు ధరలు సగానికి పడిపోయాయని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. జేపీ యాత్రకు కాంగ్రెస్ నేత రుద్రగౌడ్ మద్దతు తెలిపారు

No comments:

Post a Comment