హంద్రీనీవా ప్రాజెక్టుకు గత ఏడాది రూ. 660 కోట్లు కేటాయించగా అందులో రూ.
550 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ ప్రాజెక్టు చిత్తూరు జిల్లా వరకు
వెళ్తున్నందున వాటి పనులు వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్
కుమార్రెడ్డి కొంత ప్రాధాన్యత ఇచ్చి పోయిన ఏడాది కేటాయించిన నిధుల కంటే
రూ.40 కోట్లు అదనంగా కేటాయించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం
జిల్లాలకు సాగునీరు, తాగునీరు అవసరాలు తీర్చనున్న హంద్రీ నీవా సుజల స్రవంతి
ప్రాజెక్టు పనులు ఈ ఏడాదైనా పూర్తి అవుతాయని రైతులు ఎదురు చూస్తున్నారు.
గత ఏడాది బ డ్జెట్లో ఎస్ఆర్బీసీకి రూ. 70 కోట్లు కేటాయించినప్పటికీ రూ.
148 కోట్లు విలువ చేసే పనులు పూర్తి చేసినట్లు అధికారులు లెక్కలు తేల్చారు.
కేసీ కెనాల్ ఆధుకునీకరణకు పోయిన ఏడాది కేటాయించిన నిధుల కంటే అదనంగా ఈ
బడ్జెట్లో రూ. 15 కోట్లు ఇచ్చారు. గత ఏడాది కేటాయించిన బడ్జెట్లో కనీసం సగం నిధులు కూడా ఇవ్వకపోవడంతో పనులు
ముందుకు కదలకుండా ఆగిపోయాయి. ఈ సారైనా బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల
చేస్తే కొంతవరకు ప్రయోజనం వుంటుంది. ఇదిలా వుండగా ఫీజు రీయింబర్స్మెంట్
పథకానికి అవసరమైనన్ని నిధులు కేటాయించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి
నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేని రాజీవ్ యువకిరణాలకు ప్రత్యేకంగా బడ్జెట్
కేటాయించడం పలువురు విమర్శిస్తున్నారు. ప్రజలకు అన్ని విధాలా ఉపయోగ పడే
108, 104లకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అనంతపురం జిల్లా
అనంత సేద్యాన్ని గాడిలో పెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను రేపోమాపో ప్రభుత్వానికి నివేదించనుంది. వాటి అమలుకు నిధులను కేటాయిస్తామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ఇదివరకే ప్రకటించారు. అయితే... బడ్జెట్లో మాత్రం పైసా కూడా కేటాయించలేదు. దీన్నిబట్టి కేంద్ర కమిటీ నియమించడం కంటితుడుపు చర్యేనని విశదమవుతోంది. ఈ ఏడాది వేరుశనగ పంట రైతులను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టింది. వాతావరణ బీమా వస్తుందో, రాదోనన్న అనుమానాలను బడ్జెట్ కేటాయింపులు మరింత బలపరుస్తున్నాయి. బీమా పరిహారానికి బడ్జెట్లో రూ.300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో జిల్లాకు రూ.25 కోట్లకు మించి దక్కే అవకాశాలు లేవు! జిల్లాలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీరు అందించే లక్ష్యంతో సీఎం అయిన వెంటనే వైఎస్ పనులు ప్రారం భించారు. ఆయన హయాంలో ప్రతి బడ్జెట్లోనూ ఈ ప్రాజెక్టుకు విశేషంగా నిధులు కేటాయించి, వాటిని ఖర్చు పెడుతూ వచ్చారు. కిరణ్ సీఎం అయ్యాక గత ఏడాది బడ్జెట్లో రూ 695 కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టుకు కేటాయించారు. ఇందులో సుమారు రూ 100 కోట్లకు పైగా పాత బకాయిలు చెల్లించేందుకు ఖర్చు పెట్టారు. ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయిస్తానని సీఎం చెబుతూ వచ్చారు. ఈ స్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఇప్పటి దాకా రూ.4,933 కోట్లు ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ 1800 కోట్లు అవసరమవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ సారి కనీసం రూ వెయ్యి కోట్లు ఇవ్వాలని కోరారు. గత ఏడాది కంటే రూ.3 కోట్లు మాత్రం పెంచి రూ 698 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ నిధుల్లో 80 శాతం అనంతపురం జిల్లాలో జరుగుతున్న పనులకే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈలెక్కన చూస్తే జిల్లాలో హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులకు ఈసారి గ్రహణం పట్టే ప్రమాదం కనిపిస్తోంది.
చిత్తూరు జిల్లా
కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేసేలా అధికార యంత్రాంగంపై ముఖ్యమంత్రి వత్తిడి పెంచి... సొంత జిల్లాలో సాగునీటి పథకాలను త్వరితగతిన పూర్తి చేయించాల్సింది పోయి... నిధుల కేటాయింపులో కోత విధించడం రైతన్నలను నిరాశకు గురిచేసింది. జిల్లాలోని 19 పశ్చిమ మండలాల పరిధిలో 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు, 10 లక్షల జనాభాకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన హంద్రీ- నీవా పథకానికి 2011-12 బడ్జెట్లో రూ. 695 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ. 700 కోట్లు కేటాయించారు. ఈ పథకం పూర్తి కావడానికి రూ. 1675 కోట్లు అవసరమని ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపగా అందులో 50 శాతం కంటే తక్కువగా... 700 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ పథకం 2013లో కూడా పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు.ఇక తూర్పు మండలాల్లో మెట్టభూములను సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన సోమశిల- స్వరముఖి కాలువకు కేటాయింపులే కనిపించలేదు. సోమశిలకు ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఈ పనులకు వెచ్చిందే అవకాశం లేనందున ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టు అటకెక్కినట్టే భావించాల్సి వస్తోంది. మరోవైపు జిల్లాలో చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల మరమ్మతులు, ఆధునికీకరణ పనులకు వందలకోట్లు ఖర్చు చేస్తామంటూ ముఖ్యమంత్రి స్వయంగా చేసిన ప్రకటనపైనా బడ్జెట్ కేటాయింపులతో నీలినీడలు కమ్ముకున్నాయి. మీడియం చెరువులు, ప్రాజెక్టుల పునరుద్ధరణకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కేటాయింపు 130 కోట్లు మాత్రమే కావడంతో... అందులో జిల్లాకు దక్కేది ఎంతో వేచిచూడాలి.రీకాళహస్తి నియోజక వర్గంలోని 36,847 హెక్టార్ల భూములకు సాగునీరందించే లక్ష్యంతో ప్రారంభించిన సోమశిల- స్వర్ణముఖి కెనాల్కు ఈ బడ్జెట్లో కూడా నామ మాత్రపు నిధులే దక్కాయి. సోమశిల ప్రాజెక్టుతో పాటు ఈ కెనాల్కు బడ్జెట్లో రూ.230 కోట్లు కేటాయించారు. 100 కిలోమీటర్ల 425 మీటర్ల దూరం తవ్వే కెనాల్కు ఇందులో కనీసం 50 కోట్లు కూడా దక్కే అవకాశాలు లేవు. గత బడ్జెట్లో ఈ కెనాల్ నిర్మాణానికి 90 కోట్లు కేటాయించగా,44 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు.గాలేరు- నగరి పనులు ఇప్పడు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు గత ఏడాది బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయిస్తే పెండింగ్ బిల్లులు చెల్లించి పనులు వేగంగా చేయిస్తామని అధికారులు ప్రభుత్వానికి విన్నవించారు. కేవలం 450 కోట్లు కేటాయించి, ఈసారి సర్దుకు పోవాలంటూ ప్రభుత్వం సముదాయించింది. ఈ సారైనా వెయ్యి కోట్లు ఇవ్వాలని అధికారులు ప్రభుత్వాన్ని అడిగారు. అయితే రూ 420 కోట్లు మాత్రం కేటాయించింది. ఈ నిధుల్లో 80 శాతం వైఎస్సార్ జిల్లాలో జరుగుతున్న పనులకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావాలంటే రూ 1300 కోట్లు అవసరం అవుతాయి. జిల్లాలో 1.03 లక్షల ఎకరాలకు తాగునీరు, అనేక గ్రామాలకు తాగునీరు అందించే ఈ ప్రాజెక్టు మళ్లీ గాలిలో దీపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.బడ్జెట్ కేటాయింపుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది.
కడప జిల్లా
గత రెండేళ్ళతో పోలిస్తే... జిల్లాలో ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయింపులు గత రెండేళ్ళతో పోలిస్తే బాగా తగ్గాయి. ముగ్గురు మంత్రులు జిల్లాలో ఉన్నా జిల్లాకు సముచితమైన బడ్జెట్ కేటాయింపులు చేయించుకోలేక పోయారు. బడ్జెట్ కేటాయింపులు ఏటేటా ఇలా కుచించుకు పోతూ వస్తుంటే ప్రాజెక్టుల పూర్తి ఎప్పటికి సాధ్యమవుతుందో చెప్పడం కష్టమే.ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో జిల్లాలోని ప్రాజెక్టులకు, మిగతా రంగాలకు కోతలు పెట్టారు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశాలు మృగ్యమైపోయాయి. నిధులు సమకూర్చి పనులు నిర్వహిస్తే కొద్ది నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులను సైతం ప్రభుత్వం గాలికొదిలేసింది. మూడేళ్లుగా జిల్లాలోని ప్రాజెక్టులకు కేటాయింపుల్లో నిధుల కోత పడుతునే ఉంది. జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు, కేబి నెట్ ర్యాంకు స్థాయి నేత ఉన్నా బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత లేకపోవడం గమనార్హం. జిల్లాకు ప్రాణప్రదమైన జీఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కూడా కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది.బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నా విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. గత ఏడాది జీఎన్ఎస్ఎస్ మొదటి దశ పనులకు 540 కోట్లు కేటాయించినప్పటికీ, కేవలం 225.32 కోట్లు మాత్రమే విడుదల చేసింది. మైలవరానికి 9.90 కోట్లు, తెలుగుగంగకు 118.19 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. గండికోట రిజర్వాయర్కు 150 కోట్లు కేటాయించినప్పటికీ 149.95 కోట్లు, గండికోట లిఫ్ట్లకు 50 కోట్లు కేటాయిస్తే 11.97 కోట్లు మాత్రమే నిధులను విడుదల చేశారు. ఈ ఏడాది కూడా వెయ్యి కోట్ల కు పైగా బడ్జెట్లో నిధులు కేటాయించినప్పటికీ 50 శా తం నిధులు కూడా విడుదలయ్యే అవకాశాలు లేవు.సాగు అవసరాలతో పాటు పరిశ్రమలకు నీటిని అందిస్తున్న మైలవరం రిజర్వాయర్పై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపింది. గత బడ్జెట్లో రూ. 20 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం అందులో కోత విధించి రూ.15 కోట్లే కేటాయించింద.
కర్నూలు జిల్లా
గత ఏడాది కేటాయించిన బడ్జెట్లో కోతపెట్టి.. ఈ ఏడాది కేటాయింపులోనూ కత్తెర వేసింది. జిల్లాలో హంద్రీనీవా ప్రాజెక్టుకు మాత్రమే నిధుల కేటాయింపులోకొంత ప్రాధాన్యత కల్పించారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి శుక్రవారం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టులకు ఆశించిన మేరకు నిధులు కేటాయించకపోవడంతో రైతాంగానికి భరోసా ఇవ్వలేకపోయారనే విషయం మరో మారు తేటతెల్లమైంది. గతఏడాది కంటే ఈ సారి బడ్జెట్లో రూ. 65.19 కోట్లు కుదించారు. తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణకు రూ.82 కోట్లు, గాలేరు నగరి ప్రాజెక్టుకు రూ.419.86 కోట్లు, తెలుగు గంగకు రూ. 160 కోట్లు, గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు రూ.80 కోట్లు, హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ. 700 కోట్లు, తుంగభద్ర దిగువ కాల్వకు రూ. 18 కోట్లు, ఎస్ఆర్బీసీకి రూ.125 కోట్లు, కేసీ కెనాల్ ఆధునీకరణకు రూ.75 కోట్లు, గాజుల దిన్నె ప్రాజెక్టుకు రూ.45 లక్షలు కేటాయించారు ఇదిలా వుండగా గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులు సరిగా మంజూరు చేయకపోవడంతో అనుకున్న మేరకు పనులు వేగవంతం కాలేదు. దీంతో నిధుల కొరత వల్ల ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. ఇందులో భాగంగానే తుంగభద్ర ప్రాజెక్టు నిర్వహణ కోసం రూ.95.5 కోట్లు కేటాయించగా అందులో రూ.63.9 కోట్లు, గాలేరు నగరికి రూ.540 కోట్లకు గాను రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీంతో పాటు తెలుగు గంగకు ప్రాజెక్టుకు రూ.180 కోట్లు కేటాయించినా మరో రూ.20 కోట్ల పనులు అదనంగా చేపట్టారు. గురురాఘవేంద్రకు గత ఏడాది రూ.100 కోట్లు కేటాయించగా వీటిలో రూ.80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అందుకోసమే ప్రస్తుత బడ్జెట్లో గత ఏడాదితో పోల్చితే రూ.20 కోట్లు తక్కువ ఇచ్చారు.
No comments:
Post a Comment