Saturday, 25 February 2012

కర్నూలు జిల్లాలో భూమా నాగిరెడ్డి అనుచరులు దారుణ హత్య

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్నచింతకుంట గ్రామంలో గత రాత్రి ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అనుచరుడైన కష్ణారెడ్డి కుటుంబం నిద్రిస్తుండగా ప్రత్యర్థులు కారంపొడి చల్లి వేటకొడవళ్లతో దాడి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఫ్యాక్షన్ హత్యల్లో చనిపోయిన కుటుంబాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూమా నాగిరెడి, శోభానాగిరెడ్డిలు పరామర్శించారు. ఆస్తి తగాదాల కారణంగా జరిగిన ఫ్యాక్షన్ .ఈ ఘటనలో కష్ణారెడ్డి (49), అతడి భార్య గోవిందమ్మ( 45), దుబ్బోడు (40) మతి చెందారు. కష్ణారెడ్డి కొడుకు మల్లికార్జునరెడ్డి (23), మామ రామసుబ్బారెడ్డి (60) పరిస్థితి విషమంగా ఉంది. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా ఈ ఘటనకు పాతకక్షలు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చింతకుంటలో 144 సెక్షన్‌ను విధించారు.

No comments:

Post a Comment