మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఎవడు సినిమా సరిగ్గా నెల
తర్వాత, మార్చి 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి
దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభం
అయింది. చిరంజీవి-సురేఖ తొలి షాట్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత
దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని
నిర్మిస్తున్నారు. హాట్ హీరోయిన్ సమంత లీడ్ హీరోయిన్ గా, సెక్సీ బ్రిటన్
మోడల్ అమీ జాక్సన్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ
ప్రసాద్ తొలిసారిగా రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్
చరణ్ ను ఈ చిత్రంలో సరికొత్త కోణంలో హాట్ అండ్ రొమాంటిక్ చూపించే ప్రయత్నం
చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్
లుక్ ఫోస్టర్ విభిన్నంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.

No comments:
Post a Comment