Friday, 24 February 2012

కర్నూలు జిల్లాలో చిరుతను బంధించిన గ్రామస్థులు

కర్నూలు జిల్లాలో ఓ చిరుత హల్‌చల్‌ చేసింది. ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు గ్రామస్తుల చేతిలో బందీగా మారింది. డోన్‌ మండలం చనుగొడ్ల గ్రామంలో గొర్రెల కోసం వచ్చిన చిరుతను కుక్కలు వెంబడించటంతో భయపడిన చిరుత చెట్టు పైకెక్కింది. ఇది చూసిన గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు.పారిపోతున్న చిరుతను గ్రామస్తులంతా రాళ్లతో దాడిచేసి ప్రాణాలతో పట్టుకున్నారు. కొనఊపిరితో ఉన్న చిరుతను గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నెలరోజులుగా చిరుత సంచరిస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్తున్నారు.

No comments:

Post a Comment