Tuesday, 14 February 2012

స్వతంత్ర అభ్యర్థిగా గుర్తించండి... జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

తమను స్వతంత్ర సభ్యురాలిగా గుర్తించాలని, లే దా రాజీనామా ఆమోదించాలని జగన్ వర్గం ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి స్పీకర్‌ను కోరారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ తనకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఆమె స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.పీఆర్పీని ఇంకా ఎంతకాలం ప్రత్యేక పార్టీగా గుర్తిస్తారని స్పీకర్‌ను ప్రశ్నించారు. తనను ఇండిపెండెంట్ గా గుర్తిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంద సభ్యురాలిగా కొనసాగిస్తానని శోభానాగిరెడ్డి పేర్కొన్నారు.

No comments:

Post a Comment