ఈ- టికెట్ విధానం ద్వారా రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు నిబంధనల్ని
దక్షిణ మధ్య రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ - టికెట్ ద్వారా రిజర్వేషన్
చేయించుకున్న ప్రయాణికులు వారికి వచ్చిన ఎస్ఎమ్ఎస్ను పూర్తి సమాచారంతో
చూపించని యెడల రూ. 50 అపరాధ రుసుము చెల్లించాల్సింటుందని రైల్వే బోర్డు
నిర్ణయించింది. ఐఆర్టీసీ వెబ్సైట్లో ఈ- టికెట్ ద్వారా టికెట్ రిజర్వేషన్
చేసుకున్న వారికి వచ్చిన ఎస్ఎమ్ఎస్లను చూపిస్తే రైలులోకి అనుమతిస్తామని
రైల్వే బోర్డు తెలిపింది. తమ ఈఆర్ఎస్ టికెట్ను కోల్పోయిన లేదా
ప్రయాణ సమయంలో తమ టికెట్ను చూపించకపోతే ప్రయాణికులకు రూ. 50 జరిమానా
విధిస్తామని తెలిపింది. తమ ప్రయాణానికి ముందు వారితో పాటుగా గుర్తింపు
కార్డు, ఫాన్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, ఫోటో గుర్తింపు కార్డు,
ఫాస్పోర్టు, లేదా స్టూడెంట్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్లను
ప్రయాణికులు చూపించాల్సింటుందని రైల్వే బోర్డు పేర్కొంది.
No comments:
Post a Comment