Monday, 23 January 2012

బాబు అనుమతి కావాలా...?వైయస్ వివేకానంద రెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం విరుచుకు పడ్డారు. వైయస్ విగ్రహాలు పెట్టడానికి చంద్రబాబు అనుమతి తీసుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజలు వైయస్‌పై అభిమానంతో విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటున్నారని, అలాంటి విగ్రహాలకు చంద్రబాబు అనుమతే కాదు ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలను తీసివేయమని ఎవరైనా అడిగారా అని ప్రశ్నించారు. చనిపోయిన వారి గురించి అలా దురుసుగా మాట్లాడటమేమిటని, ఆయనది నోరా కాదా అన్నారు. పులివెందుల నియోజకవర్గానికి నీటి కేటాయింపులపై కూడా ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందులకు రావాల్సిన నీటి కేటాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. నీటిని ఏమాత్రం కేటాయించకుండా ఇప్పుడు నీరు లేదని చెప్పడం దారుణమన్నారు. ఈ విషయమై అధికారుల నుండి ముఖ్యమంత్రి వరకు తీసుకు వెళ్లినా ఫలితం లేదని, ఇందుకోసం పోరాటం చేస్తామన్నారు.

No comments:

Post a Comment