Monday, 5 December 2011

ప్రలోభాలకు లొంగేది లేదు....ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

అవిశ్వాస తీర్మానం విషయంలో తాము కాంగ్రెసు పెట్టే ప్రలోభాలకు లొంగేది లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు. ప్రభుత్వానికి మద్దతివ్వాలని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులపై కాంగ్రెసు నాయకులు ఒత్తిడి తెస్తున్నారని ఆమె సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. ప్యాకేజీలు ఇస్తామని చెబుతున్నారని, తమకు ప్యాకేజీలు అవసరం లేదని ఆమె చెప్పారు. రైతుల సమస్యలపైనే తాము తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని ఆమె చెప్పారు. తమ వర్గం శానససభ్యులను ప్రలోభ పెట్టడానికి కాంగ్రెసు యంత్రామంతా రంగంలోకి దిగిందని ఆమె అన్నారు. కెవిపి రామచందర్ రావు, బొత్స సత్యనారాయణ, డి. శ్రీనివాస్, మంత్రులు తమ పార్టీ శాసనసభ్యులను లోబరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రతిపక్షంలో ఉండాలని ఐదేళ్ల కోసం ప్రజలు తీర్పు ఇస్తే, కక్కుర్తి పడి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారని వైయస్ జగన్ క్యాంప్ శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. తమపై ఈ రోజు రాత్రే అనర్హత వేటు పడినా ఫరవా లేదని వారన్నారు.

No comments:

Post a Comment