Monday, 5 December 2011

పులివెందుల రోగులకు శిక్ష

అక్కడ నర్సులే డాక్టర్లు. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తారు. దంత వైద్యులు సాధారణ వైద్యుల అవతారం ఎత్తుతారు. ఉన్న ఒకే ఒక సూపరింటెండెంట్ పరిపాలనా బాధ్యతలతో వైద్యం చేయలేని పరిస్థితి. ఇక మందుల సంగతి చెప్పక్కరలేదు. అనేక వ్యాధులకు మందులు బయట కొనుక్కోవాల్సిందే...ఇదీ పులివెందుల ఏరియా ఆస్పత్రి దుస్థితి. 15 మంది వైద్యులు ఉండాల్సిన చోట ఇద్దరే ఇద్దరున్నారు. వారిలో ఒకరు సర్జన్. మరొకరేమో దంత వైద్యుడు. ఆస్పత్రులలో అన్ని మందులూ ఉన్నాయని మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పే మాటలకూ అక్కడి పరిస్థితికీ పూర్తి విరుద్ధం. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రభుత్వ పెద్దలు దీని గురించి పట్టించుకోవడమే మానేశారు. రాజకీయ కక్షతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి అక్కడ వైద్యులను నియమించేందుకు కృషి చేయడం లేదు.ఓట్లు వేయలేదనే కోపంతో..సాధారణంగా నేతలు రాజకీయ కక్షలు పెట్టుకున్నా...ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురవకుండా ఉండేందుకు వారికి ఇబ్బంది కలగకుండా చూస్తారు. మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం అలా కాదు.. మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రజలు డిపాజిట్ దక్కనీయకుండా ఓడించడంతో, వారిపై ‘కసి’ పెంచుకున్నారు. దీనికి తోడు ఆయనపై భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత ఊరు పులివెందుల. అందుకేనేమో మంత్రి డీఎల్ మరింత రాజకీయ కక్ష పెంచుకుని అక్కడి ఆస్పత్రిలో సేవలు మెరుగు పరిచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. వైద్యులను నియమించకపోవడంతో రోగులకు నర్సులే దిక్కవుతున్నారు. ఆయుర్వేద, దంత వైద్యులు జనరల్ డ్యూటీ డాక్టర్‌లుగా మారిపోయారు

No comments:

Post a Comment