నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు
ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల
దేవస్థానంలో కొలువున్న శ్రీ భ్రమరాంబిక, మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో
రానున్న నూతన సంవత్సర సందర్భంగా ఆదివారం రోజున శ్రీశైల దేవస్ధానంలో
ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి వి హనుమంతరావు
తెలిపారు. నూతన సంవత్సరంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక
సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోజున అన్ని
ఆర్జిత సేవలను రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. శాశ్వత
కల్యాణాలు త ఉన్నా భక్తులు యధావిధిగా కల్యాణాలు నిర్వహించబడతాయని అంతేకాక
ఆ రోజున ఆలయ వేలాలలో కూడా మార్పులు చేయనున్నారు. వేకువ జాముననే 3:30
గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు 4గంటలకు సుప్రభాత సేవ, 4:30గంటలకు
మహామంగళహారతి నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.
No comments:
Post a Comment