శ్రీశైల ప్రాజెక్ట్ కాలనీలో విద్యార్థుల కోసం అధునాతన బోధనా
పద్దతిలో
భాగంగా డిజిటల్ బోర్డు ద్వారా విద్యాబోధనను పాఠ్యాంశాలగా బోధించేందుకు
మధ్యాహ్నం జెన్కో ఛీప్ ఇంజనీరు లక్ష్మినారాయణ రావు చేతుల మీదుగా
ప్రారంభించారు. స్థానిక డిఎవి ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులకు డిజిటల్
తరగతులను నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్ర కంకణం
కట్టుకున్నారు. ఇందులో భాగంగా పోటీ ప్రపంచంలో అంచెలంచెలుగా పెరుగుతున్న
బోధనాపద్దతులకు ధీటుగా మా విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు
ఈ డిజిటల్ బోర్డుల ద్వారా విద్యను బోధించేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన
అన్నారు. ఈసందర్భంగా జెన్కో సిఇ మాట్లాడుతూ ఈ పద్దతుల ద్వారా విద్యార్థులు
పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుని తెలివితేటలను మెరుగుపరుచుకుని
తద్వారా ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుకోవచ్చని దాని ద్వారా పాఠ్యాంశాలపై మంచి
పట్టును కూడా సాధించవచ్చునని ఈ కార్యక్రమంలో జెన్కో రైట్ బ్యాంక్
సూపరింటెండింగ్ ఇంజనీరు రాంబాబు, ఇఇలు రవీంద్ర, డిఇలు సత్యసాయిబాబా,
శ్రీనివాసులు, ఎడిఇ రామకృష్ణారెడ్డి, అకౌంట్ అధికారులు ఎమ్ఎస్ఆర్కె
శర్మ, శ్రీ్ధర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment