న్యూఇయర్ వేడుకలకు ముస్తాబు
కాల గమనంలో ఎన్ని వసంతాలు మన కళ్ల ముందు మంచులా కరిగిపోతున్నా కొత్త
సంవత్సరం రాక నూతనోత్సాహమే. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త
సంవత్సరాన్ని వినూత్నంగా ఆహ్వానం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే..
మరికొందరు పుణ్యక్షేత్రాలకు పయనమవుతున్నారు. అలా వీలు కాని వాళ్లు మాత్రం
స్థానికంగానే అంబరాన్నంటే సంబరాల్లో మునిగిపోవాలని పరితపిస్తున్నారు. కొత్త
ఏడాది ప్రారంభానికి రెండు రోజులుండగానే ‘అనంత’ సుందరంగా ముస్తాబవుతోంది.
వన్ ప్లస్ వన్ ఆఫర్లంటూ అప్పుడే వ్యాపారస్తులు న్యూఇయర్ బొనాంజా
ప్రకటిస్తున్నారు.మద్యం కూడా ఆఫర్లలో లభిస్తుండడంతో
మద్యంప్రియులు హుషారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వస్త్రదుకాణాలు
కిటకిటలాడుతున్నాయి. పలు విద్యా సంస్థలు వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక
ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా కాలం తెచ్చిన మార్పుతో గ్రీటింగ్
కార్డులు వెలవెలబోతున్నాయి. సెల్ ఫోన్తో క్షణాల్లో శుభాకాంక్షలు
చెప్పుకునే వీలుం డడంతో అందరూ వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఏడా ది
తమ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంతో
జ్యోతిష్కులకు డిమాండ్ పెరి గింది. గురువారం నగరంలోని రెస్టారెంట్లు, ఐస్
క్రీం పార్లర్లు, బేకరీలు విద్యుద్దీపాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
No comments:
Post a Comment