'జిల్లాలో వ్యవసాయ రంగం నష్టం పోవడానికి కారణాలను అధ్యయనం చేసేందుకు
ఏర్పాటు అయిన కేంద్ర క మిటీ జనవరిలో.. జిల్లాలో పర్యటన చేస్తుంది. ఇక్కడి
వాస్తవ పరిస్థితులు, పక్కా సమాచారం సేకరించి ఆ బృం దానికి నివేదికలు
ఇవ్వండి. పర్యటన లో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళిక బద్ధంగా
చేపట్టేందు కు సిద్ధం చేయాల'ని అధికారులకు రె వెన్యూ శాఖ మంత్రి
రఘవీరారెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరిలో 12 మంది సభ్యులతో
కూడిన కేంద్ర బృం దం జిల్లాలో పర్యటించనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా
పర్యటించి సమగ్రం గా పరిశీలన జరిపి జిల్లా వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికను
తయారుచేస్తారన్నారు ఇందు కోసం వారికి అవసరమైన పూర్తి సమాచారాన్ని
ప్రణాళిక బ ద్ధంగా రూపొందించి అమలు చేయాలన్నారు. వారికి సరైన దిశానిర్దేశం
చేయాలన్నారు. రైతులు ఇబ్బందుల తెలుసుకుని సీఎం కిరణ్కుమార్రెడ్డి జి
ల్లాకు రెండు టీఎంసీల నీటిని కేసీకెనాల్ ద్వారా విడుదలకు ఆదేశాలు ఇ
చ్చారన్నారు. సాగునీటి కోసం రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం
లేదన్నారు. అన్ని ప్రాంతాలకు కచ్చితంగా సాగునీరు అందిస్తామన్నారు.
No comments:
Post a Comment