ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమే....భూమానాగిరెడ్డి
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని వెనకాడే ప్రసక్తే లేదని వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యులు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి
పేర్కొన్నారు. గోస్పాడులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో
ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానాలకు
ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నామని భూమా స్పృష్టం చేశారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామా చేసిందన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రైతుల అభ్యున్నతికి
పాటుపడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆశయాలను కాంగ్రెస్
ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి
గెలిపిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెంచిన ధరలతో రైతులు,
సామాన్య ప్రజానికం కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడుతున్నారని ఇంత అసమర్థత
ప్రభుత్వాన్ని ఎన్నడు చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన
పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన
ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము
సిద్దంగా ఉన్నామని మాజీ ఎంపి భూమానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment