Sunday, 27 November 2011

కర్నూలు నగర ప్రజలకు ఉచిత మినరల్ వాటర్

కర్నూలు తాగునీటి సమస్య ప్రధానంగా ఉన్న కర్నూలు నగరం లో పేదవారికి కూడా మినరల్ వాటర్ అందుబాటులో కి వచ్చింది. ప్రధాన కూడళ్లలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ పేరుతో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. నగర ప్రజలు ఎదుర్కొంటున్న తా గునీటి సమస్యను దృష్టిలో ఉంచుకున్న టీజీ వెంకటేష్ స్థలం, షెల్టరు, నీరు అందిస్తే 20 మినరల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తానని మున్సిపాలిటీకి దరఖాస్తు చేశారు. వాటర్ ప్లాంటుకు అవసరమైన మిషనరీ, కూలర్, నిర్వహణ బాధ్యతలను తానే భరిస్తానని దరఖాస్తులో పేర్కొన్నారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ఇందుకు ఆమోదం లభించింది.అనంతరం నగరంలో ఇప్పటిదా కా 13 వాటర్‌ప్లాంట్లను నెలకొల్పారు. దాని ద్వారా ఉచితంగా మినరల్ వాటర్‌ను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చారు. దీంతో నగరానికి వచ్చిన గ్రామీణులకు, స్థానికులకు దప్పిక తీర్చే కేంద్రాలుగా మినరల్ వాటర్ ప్లాంట్లు నిలుస్తున్నాయి. టీజీవీ కుమారుడు భరత్ ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను చూస్తున్నారు.ఇక ఎండాకాలంలో గొంతులెండవు.. ఇక ఎండాకాలంలో నగర ప్రజలకు గొంతులెండే పరిస్థితులుండవని పలువురంటున్నారు. ప్రతిరోజూ 15నుంచి 20వేల మంది ఉపయోగించుకుంటున్నారని నిర్వాహకులు చెబుతున్నారు

No comments:

Post a Comment