Sunday, 27 November 2011

కడప జిల్లా పులివెందుల్లో సోలార్ విద్యుత్ కేంద్రం

రాష్ట్రంలోనే మొట్టమొదటి సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో ఏర్పాటవుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఇందుకోసం సుమారు 100 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. ఈ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని వెల్స్‌పన్ సోలార్ ఎపి ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చే స్తోంది. ఒక్కొక్క మెగావాట్ సోలార్ విద్యుదుత్పత్తికి 14 కోట్ల రూపాయల వ్యయం కానుందని మొత్తం 5 మెగావాట్లకు 70 కోట్ల రూపాయలు అవసరం కానుండగా పులివెందుల పారిశ్రామికవాడలో 40 ఎకరాల భూమి, భవన నిర్మాణాలకు మరో 30 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. మూడు నెలల క్రితమే పనులు ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ప్యానల్ వర్క్ తదితర పనులు సాగుతున్నాయి. మరోవైపు సోలార్ విద్యుదుత్పత్తికి అవసరమైన ప్యానల్ బోర్డులు సహా ఇతరత్రా పరికరాలు ఉత్పత్తి కేంద్రానికి చేరుకున్నాయి. మరో 40, 50 రోజుల్లో ఈ పనులన్నింటిని పూర్తి చేసి డిసెంబర్ చివరిలో లేదా జనవరిలో విద్యుదుత్పత్తిని ప్రారంభించనున్నట్లు ఆ ప్రతినిధి పేర్కొన్నారు

No comments:

Post a Comment