అనంతపురం జిల్లాలో ఔషధ తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించని 41మందుల దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అనంతపురంలో 30, హిందూపురంలో 11షాపులను సీజ్ చేశారు. రోగుల బంధువులుగా అధికారులే మందులు కొనుగోలు చేశారు. దీంతో దుకాణదారుల నిజస్వరూపం బయటపడింది. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకపోయినా అమ్మకాలు జరపడం, బీ ఫార్మసి లేకపోయినా యధేచ్చగా విక్రయాలు కొనసాగించడాన్ని గుర్తించారు. దీంతో సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. అధికారుల వరుస దాడులతో హడలి పెద్దఎత్తున మెడికల్ షాపులు మూసేసుకున్నారు. మెడికల్ షాపుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడంలేదని సాక్షాత్ వైద్యఆరోగ్య మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంగీకరించారు. రాష్ట్రంలోని 90శాతానికి పైగా దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేరని తెలిపారు. అయితే నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు
No comments:
Post a Comment