Wednesday, 30 November 2011

రేపు ముంబయి నగరంలో టీటీడీ సమాచార కేంద్రం ప్రారంభం

ముంబయి నగరంలోని సైమాన్ ఏరియాలో గురువారం టీటీడీ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు కోరిన సమాచారాన్ని అందించేందుకు అత్యాధునిక సమాచార వ్యవస్థ, మౌలిక సదుపాయాలతో ఈ సమాచార కేంద్రాన్ని నెలకొల్పారు. గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ పాటిల్ చేతుల మీదుగా ఈ సమాచార కేంద్రం ప్రారంభమవుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆర్‌వై.గైక్వాడ్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్‌వీ.సుబ్రమణ్యం, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని టీటీడీ పేర్కొంది

No comments:

Post a Comment