కర్నూలు జిల్లాలోని వివిధ దేవస్థానాలు, చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. గత జూన్ 23న టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జమేష్ రంజన్ ప్రముఖ దేవస్థానాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలోని 15 క్షేత్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7.53 కోట్లతో జిల్లా పర్యాటక శాఖ కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపింది.
స్థల సేకరణను బట్టి గెస్ట్హౌస్లు, నీటి వసతి, పబ్లిక్ టాయ్లెట్స్, పార్కులు, స్వాగత తోరణాలు తదితరాలను నిర్మిస్తారు. డార్మెటరీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తారు. అవసరమున్న చోట రెస్టారెంట్ల నిర్మాణం చేపడతారు.
స్థల సేకరణను బట్టి గెస్ట్హౌస్లు, నీటి వసతి, పబ్లిక్ టాయ్లెట్స్, పార్కులు, స్వాగత తోరణాలు తదితరాలను నిర్మిస్తారు. డార్మెటరీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తారు. అవసరమున్న చోట రెస్టారెంట్ల నిర్మాణం చేపడతారు.
No comments:
Post a Comment