అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన తైదుల ఈశ్వరరెడ్డి పొలంలో బుటారు నాగరాజు మంగళవారం వినూత్న ప్రయోగం చేశారు. ఒంటెద్దుకు గంతలు కట్టి పగ్గాలు, పట్టెండ్లు లేకుం డా 12 ఎకరాల్లో జొన్న సాగుచేశాడు. ఉద యం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు సాగు పూర్తిచేశాడు. సాధారణంగా కాడెద్దులతోనే ఎనిమిది గంటల వ్యవధిలో ఇంత విస్తీర్ణంలో సాగుచేయడం కష్టసాధ్యం. అలాం టిది ఒకే ఎద్దుకు గంతలు కట్టి విత్తడం ఆషామాషీకాదు. ఈ దృశ్యాన్ని మండలంలోని పలు గ్రామాల రైతులు తిలకించి యువరైతు నాగరాజును అభినందించారు.
No comments:
Post a Comment