జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ అలజడి మొదలైంది. కప్పట్రాళ్లలో వెంకటప్పనాయుడు ఇంటిపై మద్దిలేటి వర్గీయులు దాడి చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కప్పట్రాళ్లలో ఉద్రికత నెలకొంది దేవనకొండ మండలపరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లగ్రామాన్ని కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి అన్న కుమారుడు పరప్ప నాయుడుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినందున వారి స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామాన్ని డిఎస్పీ సందర్శించి అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వెంకటప్పనాయుడు, పరప్ప నాయుడు, మద్దిలేటి నాయుడు ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరు హత్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని డిఎస్పీ తెలియజేశారు. గ్రామంలో ప్రజలందరూ పొలం పనులకు వెళ్లడం వలన గ్రామ వీధులన్ని నిర్మాణుషంగా మారాయని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఐదుమంది ఎపిఎస్పి పోలీసులు, నల్గురు సివిల్ పోలీసులను గ్రామంలో బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలియజేశారు.
No comments:
Post a Comment