Tuesday, 29 November 2011

పెరిగిన గ్రూప్-1 పోస్టుల సంఖ్య

గ్రూప్-1 పోస్టులను మరో 41 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంటూ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 సంబంధించి 263 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో 39 ఎంపీడీవోలు, 2 డిఎస్పీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 304కు పెరిగింది. గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

No comments:

Post a Comment