Tuesday, 29 November 2011

జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు

జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. ఉదయం విఆర్ ఓ, మధ్యాహ్నం విఆర్ ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు ఖరీదు 200 రూపాయలు. ఎస్ సి, ఎస్టీలకు వంద రూపాయలు. ఈ పరీక్షల ద్వారా 1172 విఆర్ ఓ పోస్టులు, 6063 విఆర్ఏ పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వయోపరిమితి సడలింపుపై రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రి చెప్పారు.

No comments:

Post a Comment