Saturday, 15 October 2011

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది

                           
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు చిత్తూరు జిల్లా నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 50 శాతం మంది ఓటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రెండు నెలల్లోనే ఈ జిల్లాలో పార్టీకి విశేష స్పందన అభించింది. ఈ నియోజకర్గంలో 1,27,250 మంది ఓటర్లు ఈ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి చంద్రగిరి నియోజకవర్గం వివరాలను జగన్మోహన రెడ్డికి అందజేశారు. 43 పంచాయతీల నుంచి నమోదైన సభ్యత్వం వివరాలను ఆయన తెలియజేశారు

No comments:

Post a Comment