Saturday, 15 October 2011

ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడము

                                                   
రైతు సమస్యలను పరిష్కరించడానికి ముందుకు రాక పోతే ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి వెనకాడమని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుసెనగ పంట దెబ్బతిన్న రైతులకు అండగా నిలవడం కోసం టిడిపి పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కరువు యాత్ర కార్యక్రమంలో శుక్రవారం లత్తవరణ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, జిల్లా టిడిపి అధ్యక్షులు పార్థసారధిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటు గొప్పలు చెబుతోందని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని వారు ఆరోపించారు. రైతుల పక్షాన టిడిపి అండగా ఉంటుందని అన్నారు. రైతులకు పంట నష్టపరిహారం అందచేయలేదన్నారు. జిల్లా రైతులను ఆందుకోవడం కోసం ఈ సమస్యలను హైదరాబాద్ వరకు తీసుకెళ్లి మొండి ప్రభుత్వం మెడలు వంచడానికి దశలుగా టిడిపి అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. పంట దెబ్బతిన్న రైతులకు పరిహరం పంపిణీ చేస్తామని, పంటల బీమా అందచేస్తామని ప్రభుత్వం ఇప్పటి వరకు రైతుల ఖాతా జమ చేయలేదన్నారు. జిల్లా రైతులను ఆదుకోవడం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు రుణ మాఫీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఎకరానికి 10 వేల రూపాయలు చొప్పున పరిహారం అందచేయాలని వారన్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నప్పమటికీ రైతు గురించి మాట్లాడిన పాపాన పోలేదన్నారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించి రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగిరాక పోతే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు

No comments:

Post a Comment