Sunday, 23 October 2011

సీమ జిల్లాల్లో చైతన్యం తెద్దాం



సీమ జిల్లాల్లో చైతన్యం తెద్దాం కర్నూలు వేదికగా హాజరైన నేతలు ఇదే స్ఫూర్తితో రాయలసీమ జిల్లాలోని ప్రాంతాల్లో నిరంతర సదస్సులు ఏ ర్పాటు చేసుకొని ప్రజల్లోచైతన్యం తీసుకుని రావాలని నేతలు కోరారు. ఇప్పటి వరకు కడప, కర్నూలు వేదికగా జరిగి న సదస్సులు విజయవంతం కావడం తో అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో స దస్సులు నిర్వహించి సమైక్య నినాదా న్ని తెలంగాణ నినాదం కంటే బలోపే తం చేసేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.

పార్టీలకతీతంగా హాజరైన నేతలు సీమ జిల్లాల్లోని కాంగ్రెస్, తెలుగుదే శం, జగన్ పార్టీలకు చెందిన పలువురు నేతలు సమైక్యాంధ్ర నినాదాన్ని చాటా రు. రాయలసీమ హక్కుల ఐక్యవేదిక కన్వీనర్ టీజీ వెంకటేష్, కన్వీనర్‌సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు కేఈ కృష్ణమూర్తి, మైసూరారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి, వీర శివారెడ్డి, మీనాక్షినాయుడు, నిమ్మలకిష్టప్ప, కేఈ ప్రభాకర్, ఎస్‌వీ మోహన్‌రెడ్డి, లింగారెడ్డి, పల్లెరఘునాథరెడ్డి, ఎన్.తులసిరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్, గురునాథ్‌రెడ్డి, అ బ్దుల్‌ఘని, శ్రీకాంత్‌రెడ్డి, కాటసాని రా మిరెడ్డి, డాక్టర్ పి.రవి, సుబ్బారెడ్డి, వరదరాజులరెడ్డి, సుధాకర్‌బాబు, బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి, పోచంరెడ్డిసుబ్బారెడ్డి, చెన్నకేశవరెడ్డి, కమలమ్మ, టీజీ భ రత్ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment