Sunday, 23 October 2011

జిల్లాలోని 25 మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు

జిల్లాలోని 25 మండలాల్లో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ చెప్పారు. శనివారం ఉదయం డిఆర్‌డిఎ సమావేశ మందిరంలో గ్రామ సమాఖ్య ప్రతినిధులు, ఎపిఎంలతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐకెపి ద్వారా మహిళా సంఘాలు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నాయని తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు వల్ల పేద రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరడమేగాక స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా పరిపుష్టి అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఐకెపి సంఘాల ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు పెద్ద ఎత్తున విజయవంతంగా జరుగుతోందన్నారు. అనంతపురం జిల్లాలో కూడా ఇటీవల ఈ కార్యక్రమం ప్రారంభమైందని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో కూడా రామచంద్రాపురం, వెదురుకుప్పం, వాల్మీకిపురం, గుర్రంకొండ, కలికిరి, కలకడ, పిటిఎం, బి.కొత్తకోట, మదనపల్లి, నిమ్మనపల్లి, మొలకలచెరువు, తంబళ్లపల్లి, పెద్దపంజాణి, రామసముద్రం, సోమల, కుప్పం, తూర్పుప్రాంతాల్లోని తొమ్మిది మండలాలో కలిపి 25 మండలాల్లోకెపి సంఘాల ద్వారా వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రతి సమాఖ్య ఐదుగురి సభ్యులతో సేకరణ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని ఈ కమిటీలకు రెండు రోజుల శిక్షణ ఇస్తామని తెలిపారు. ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యంలో తేమ కొలవడానికి యంత్రాలు, ఎలక్ట్రానిక్ తూనిక పరికరాలు, గోనె సంచిలు అందజేస్తామని చెప్పారు. శిక్షణా కార్యక్రమంలో సమగ్రంగా అవగాహన కలిగిస్తామని చెప్పారు. వ్యవసాయ, రెవిన్యూ శాఖల ద్వారా రైతుల్లో కూడా అవగాహన కల్పించాలని తెలిపారు

No comments:

Post a Comment