Friday, 9 March 2012

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్....రాహుల్ ద్రావిడ్

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే టి-20 కేరీర్‌కు వీడ్కోలు పలకగా, చివరిగా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా వైదొలిగారు. పదహారేళ్ళపాటు టెస్ట్ క్రికెట్‌లో ఆడడం ఆనందంగా ఉందని, తనను ఇంతగా ఆదదరించిన అభిమానులకు ద్రావిడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో తమ రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన కెరీర్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లో భార్య, కుటుంబ సభ్యుల సహకారం మరువరానిదని ఆయన అన్నారు. భారత జట్టుకు సారథ్యం వహించడం తన అదృష్టమని, ఆస్టేలియా టూర్ తరువాత రిటైర్ కావాలనుకున్నానని, యువ క్రికెటర్లకు అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు రాహుల్‌ద్రావిడ్ పేర్కొన్నారు. కికెట్ నుంచి తప్పుకుంటున్నందుకు విచారంగా లేదని అన్నారు. తప్పుకుంటున్నందుకు విచారమేమీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ద్రావిడ్ చెప్పారు. ద్రావిడ్ 164 టెస్టు మ్యాచులు ఆడాడు. 13,288 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36 సెంచరీలు, టెస్టుల్లో 63 అర్థ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్, గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో ఆడడం తనకు గౌరవమని ద్రావిడ్ అన్నారు. 16 ఏళ్ల పాటు ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకున్నానని ఆయన అన్నారు. తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, యువకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అద్భుతమైన యుగంలో తాను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విచారంతోనే తప్పుకుంటున్నా గౌరవంగా ఉందని ఆయన అన్నారు.తన నిర్ణయాన్ని సచిన్ స్వాగతించినట్లు ద్రావిడ్ చెప్పారు. క్రికెట్ జీవితంలో పొగడ్తలూ ఉన్నాయి, విమర్శలూ ఉన్నాయని ఆయన అన్నారు. టీమిండియాలో విభేదాలున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

No comments:

Post a Comment