Thursday, 8 March 2012

పన్ను ఎగవేతలో అనంతపురం జిల్లాకు రెడ్‌మార్క్

సకాలంలో పన్ను చెల్లించి శాభివృద్ధికి, ప్ర జా సంక్షేమానికి దోహద పడాలని ఆదాయ పన్నుల శాఖ అనంతపురం రీజియన్ జాయింట్ కమిషనర్ వివి రమణరావు వ్యాపారులు,పన్ను చెల్లింపుదారులకు సూచించారు. పన్నుల ఎగవేతలో అనంతపురం జిల్లాకు హైదరాబాద్‌లో రెడ్‌మార్క్ ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ముందస్తు పన్నుల చెల్లింపు- ప్రయోజనాలు’ అంశంపై బుధవారం సాయంత్రం స్థానిక ఐఎంఎ హాలులో వివిధ వ్యాపా ర వర్గాలతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక సీనియర్ ఆదాయ పు పన్నుల శాఖ అధికారి శివానందం అధ్యక్షతన జరిగిన సదస్సులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నంబూరి శంకర్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు నరసింహయ్యశెట్టి తదితరులు పాల్గొన్నారు. రమణరావు మాట్లాడుతూ పట్టణంలో వ్యాపార వర్గాలు పన్నుల ఎగవేతకు పాల్పడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. హిందూపురంలోని బంగారు నగల వ్యాపారులు ఒక్కరు కూడా రూ.40 లక్షల లావాదేవీలను చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కేవలం రూ.6 లక్షల నుండి రూ. 7 లక్షల వరకు మాత్రమే లావాదేవీలను చూపిస్తున్నారని పేర్కొన్నారు. లావాదేవీలు ఇలా చూపిస్తే ఆదాయం ఏ మేరకు బయటపడుతుందన్నారు. ఆదాయపు పన్నుల శాఖ తనిఖీలు నిర్వహిస్తే పన్నుల ఎగవేత సులువుగా బహిర్గతమవుతుందని స్పష్టం చేశారు. అదే విధంగా హిందూపురంలో మండీ వ్యాపారులు కూడా పెద్ద ఎత్తున పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తమ శాఖ ఇంటలిజిన్స్ విభాగం నివేదిక సమర్పించినట్లు తెలిపారు. దీనికి తోడు అనంతపురం జిల్లాకు చెందిన అనేక మంది బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగించి సబ్ రిజిస్ట్రర్ శాఖ నిర్ణయించే మార్కెట్ ధరకు, డాక్యుమెంట్‌లో చూపిస్తున్న విలువకు ఎంతో వ్యత్యాసం ఉంటోందన్నారు. బెంగళూరుకు చెందిన ఐటి శాఖ ఆయా వ్యక్తుల సమాచారాన్ని హైదరాబాద్‌కు పంపగా వారందరికీ నోటీసులు జారీ చేసి ఎగవేసిన పన్నును వసూలు చేస్తామని స్పష్టం చేశారు. హిందూపురంలో ఇప్పటికీ ఐటి శాఖ నిర్దేశించిన పన్నుల వసూళ్ళలో దాదా పు రూ.1.50 కోట్లు వసూలు కావాల్సి ఉందన్నారు. గత ఆరేళ్లుగా రిఫండ్స్ ఆగిపోవడంతో ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయని అభిప్రాయ పడ్డారు. ఆదాయపు పన్నును సక్రమంగా చెల్లించకపోతే తప్పకుండా ఆయా పన్ను ఎగవేతదారులు నష్టపోవాల్సి ఉంటుందని రమణరావు హెచ్చరించారు. భారతదేశ ఆర్థిక ప్రగతిని దృష్టిలో వుంచుకొని ప్రతి ఒక్కరూ పన్నులను సక్రమంగా చెల్లించాలని సూచించారు. ఇకపోతే ముందస్తు పన్నుల చెల్లింపు వల్ల చేకూరే ప్రయోజనాలు, చెల్లించకపోతే జరిగే నష్టాలను విశదీకరించారు. ఈ నెల 15వ తేదీ లోగా ముందస్తు పన్నును ప్రతి ఒక్కరూ చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని సూచించారు. ఈ సదస్సులో ఆడిటర్లు వరదరాజులు, రాఘవేంద్రగుప్త తదితరులు తగు సూచనలు అందచేశారు.

No comments:

Post a Comment