త్వరలో అనంతపురం అర్బన్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల విషయంలో
కాంగ్రెస్ టికెట్ ఎవరికి కేటాయించాలి అనే దానిపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి
ఒక సర్వే చేయించడట. దాన్ని లీక్ చేసి అనంతపురం అసెంబ్లీ స్థానానికి పోటీగా
తన తమ్ముడే ఉండాలని ఎంపీ అంటున్నాడట…దీనిపై జేసీ దివాకర్ రెడ్డి వర్గం
మండిపడుతోంది. ఆ సర్వే వివరాలు ఇవి..
* ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరు సరైన వ్యక్తులు,
ఆయా రాజకీయ పార్టీల్లో ఎవరెవరికి కార్యకర్తల నుంచి ఆదరణ ఉందనే విధంగా
నివేదిక రూపొందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్కు
97.4 శాతం, మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరికి 1.1 శాతం, నదీమ్కు
1.5 శాతం ఆ పార్టీ కార్యకర్తల ఆదరణ ఉందని చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డికి 99.1 శాతం ఆదరణ ఉన్నట్లు చూపించారు. సీపీఐ
నేత కె.రామకృష్ణకు 86.4 శాతం ఆదరణ ఉందని, బీజేపీలో లలిత్కుమార్కు 94.2
శాతం ఉన్నట్లు నివేదికలో చూపించారు.ఈ శాతాలు పరిశీలిస్తే ఇదో బూటకపు సర్వే
అనేది స్పష్టమవుతోంది జేసీ
ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్రెడ్డి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఉప
ఎన్నికల్లో అనంతపురం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది.
ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కేలా జిల్లా
మంత్రులు, ఎంపీ హైడ్రామాకు తెరతీశారు. ఎంపీ సోదరుడికి టికెట్
కట్టబెట్టేందుకు బోగస్ సర్వే చేయించారని ధ్వజం ఎత్తారు.ఈ సర్వేను
పరిశీలిస్తే ఇది ఎంత బూటకపు సర్వే అన్నది తెలుస్తుందన్నారు.
కాంగ్రెస్పార్టీలో ఇప్పటి వరకు పనిచేయని… కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు
తెలియని… కాంగ్రెస్పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కని… ఎంపీ సోదరుడు అనంత
సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి సరైన వ్యక్తని 95.7 శాతం మంది
కార్యకర్తలు చెప్పినట్లుగా సర్వేలో చూపించారన్నారు. వాస్తవంగా సుబ్బారెడ్డి
అనే వ్యక్తి ఎంపీ సోదరుడనే విషయం జిల్లాలో 99 శాతం మంది కార్యకర్తలకు
తెలియదన్నారు. ఇప్పటి వరకు పార్టీ ద్వారా వీరు లబ్ధిపొందారే తప్ప వీరి వల్ల
పార్టీకి ఒనగూరింది ఏమీ లేదని జేసీ వర్గం గుర్రుమంటోంది. మరి ఎన్నికల
పోరాటంలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి కన్నా కాంగ్రెస్ టికెట్ పోరాటంలో
ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తి కరంగా ఉంది.Friday, 9 March 2012
అనంతపురం జిల్లా రాజకీయ పార్టీలో ఉప ఎన్నికల సర్వే గోల
త్వరలో అనంతపురం అర్బన్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల విషయంలో
కాంగ్రెస్ టికెట్ ఎవరికి కేటాయించాలి అనే దానిపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి
ఒక సర్వే చేయించడట. దాన్ని లీక్ చేసి అనంతపురం అసెంబ్లీ స్థానానికి పోటీగా
తన తమ్ముడే ఉండాలని ఎంపీ అంటున్నాడట…దీనిపై జేసీ దివాకర్ రెడ్డి వర్గం
మండిపడుతోంది. ఆ సర్వే వివరాలు ఇవి..
* ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరు సరైన వ్యక్తులు,
ఆయా రాజకీయ పార్టీల్లో ఎవరెవరికి కార్యకర్తల నుంచి ఆదరణ ఉందనే విధంగా
నివేదిక రూపొందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్కు
97.4 శాతం, మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరికి 1.1 శాతం, నదీమ్కు
1.5 శాతం ఆ పార్టీ కార్యకర్తల ఆదరణ ఉందని చూపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్రెడ్డికి 99.1 శాతం ఆదరణ ఉన్నట్లు చూపించారు. సీపీఐ
నేత కె.రామకృష్ణకు 86.4 శాతం ఆదరణ ఉందని, బీజేపీలో లలిత్కుమార్కు 94.2
శాతం ఉన్నట్లు నివేదికలో చూపించారు.ఈ శాతాలు పరిశీలిస్తే ఇదో బూటకపు సర్వే
అనేది స్పష్టమవుతోంది జేసీ
ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్రెడ్డి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఉప
ఎన్నికల్లో అనంతపురం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది.
ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కేలా జిల్లా
మంత్రులు, ఎంపీ హైడ్రామాకు తెరతీశారు. ఎంపీ సోదరుడికి టికెట్
కట్టబెట్టేందుకు బోగస్ సర్వే చేయించారని ధ్వజం ఎత్తారు.ఈ సర్వేను
పరిశీలిస్తే ఇది ఎంత బూటకపు సర్వే అన్నది తెలుస్తుందన్నారు.
కాంగ్రెస్పార్టీలో ఇప్పటి వరకు పనిచేయని… కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు
తెలియని… కాంగ్రెస్పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కని… ఎంపీ సోదరుడు అనంత
సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి సరైన వ్యక్తని 95.7 శాతం మంది
కార్యకర్తలు చెప్పినట్లుగా సర్వేలో చూపించారన్నారు. వాస్తవంగా సుబ్బారెడ్డి
అనే వ్యక్తి ఎంపీ సోదరుడనే విషయం జిల్లాలో 99 శాతం మంది కార్యకర్తలకు
తెలియదన్నారు. ఇప్పటి వరకు పార్టీ ద్వారా వీరు లబ్ధిపొందారే తప్ప వీరి వల్ల
పార్టీకి ఒనగూరింది ఏమీ లేదని జేసీ వర్గం గుర్రుమంటోంది. మరి ఎన్నికల
పోరాటంలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి కన్నా కాంగ్రెస్ టికెట్ పోరాటంలో
ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తి కరంగా ఉంది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment