Saturday, 3 March 2012

రాలయసీమ ఎమ్మెల్యేలపై అనర్హత ఆమోదం

ఎట్టకేలకు సభాపతి 'అంతిమ తీర్పు' వెలువడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశ చరిత్రలోనే తొలిసారిగా అధికార పార్టీకి చెందిన 6 మంది ఎమ్మెల్యేలపై మూకుమ్మడిగా అనర్హత వేటు పడింది. 'శోభా నాగిరెడ్డి రాజీనామాకు ఆమోదం... 6 మందిపై వేటు'... ఇది శుక్రవారం రాత్రి పొద్దుపోయాక స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించిన నిర్ణయం. దీంతో... 3 చోట్ల ఉప ఎన్నికల ప్రక్రియ ముగియకముందే, పది జిల్లాల పరిధిలో మరో 17 స్థానాల్లో ఉప సమర వేదిక సిద్ధమైంది. దీంతోపాటు నెల్లూరు లోక్‌సభ స్థానానికీ ఉప ఎన్నిక జరగనుంది.'సెమీ ఫైనల్స్'కు తెరలేచింది. ఖాళీ అయిన స్థానాలకు ఆరు నెలలలోపు ఉప ఎన్నికలు జరగాలి. అంటే... సెప్టెంబర్ 3లోపు ఉపసమరం ముగియాలి. అయితే జూలై 25లోపు రాష్ట్రపతి ఎన్నిక పూర్తి కావాల్సి ఉంది. అందువల్ల ఆలోపే ఉప ఎన్నికలు జరపక తప్పదు.

అనంతపురం జిల్లా

గుర్నాథరెడ్డి (అనంతపురం అర్బన్)
కాపు రామచంద్రారెడ్డి (రాయదుర్గం)
కర్నూలు జిల్లా
చెన్నకేశవరెడ్డి (ఎమ్మిగనూరు)
శోభా నాగిరెడ్డి(ఆళ్లగడ్డ)
కడప జిల్లా
అమర్నాథ రెడ్డి (రాజంపేట)
శ్రీకాంత్‌రెడ్డి (రాయచోటి)

No comments:

Post a Comment