Wednesday, 22 February 2012

తొలిసారిగా నేపాల్‌లో శ్రీవారి కల్యాణాం

తొలిసారిగా పొరు గు దేశమైన నేపాల్‌లో ఈ నెల 25న శ్రీవారి 108వ కల్యాణా న్ని టీటీడీ నిర్వహించనున్న ది. ఇందుకోసం పటిష్ఠమైన బందోబస్తు మధ్య శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుల కల్యాణ మూర్తులు ఉన్న బ స్సు తిరుమల నుంచి నేపాల్ కు బయలుదేరింది.  ఈ సందర్భంగా వాసుదేవాచార్య మా ట్లాడుతూ ఇప్పటికి టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మూర్తులకు 107 కల్యాణ ఉత్సవాలు జరిగాయని, 108వ కల్యాణోత్సవం నేపాల్‌లో జరపాలని ఆ దేశపు రాజు కోరడంతో అక్కడకు వెళుతూ మార్గమధ్యంలో విజయవాడలో బస చేశారన్నారు.స్వయంగా స్వామివారి కల్యాణ ఉత్సవ మూర్తులు ఇక్కడకు రావడంతో తాము తలవని తలంపుగా ప్రాతఃకాల పూజలను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి సుదర్శన్ మాట్లాడుతూ కోదాడ, కరీంనగర్ మీదుగా నాగపూర్ వెళ్ళి, అక్కడ నుంచి నేపాల్ చేరుకుంటామన్నారు. నేపాల్‌లో ఈ నెల 25 వ తేదీన శ్రీవారి కల్యాణం జరుగుతుందని చెప్పారు. బస్సులో అర్చకులతో సహా మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు.

No comments:

Post a Comment